ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక కమిటీ సమావేశం

ABN , First Publish Date - 2022-04-23T00:40:11+05:30 IST

యాసంగి వడ్లను కొనేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను చేపట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో శుక్రవారం సమావేశమైంది.

ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక కమిటీ సమావేశం

హైదరాబాద్: యాసంగి వడ్లను కొనేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను చేపట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో శుక్రవారం సమావేశమైంది. బీఆర్కేఆర్ లో జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌర సరఫరాల శాఖ కమీషనర్ అనీల్ కుమార్ లు పాల్గొన్నారు.రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ళు, ఎఫ్.సి.ఐ కి అందించే ధాన్యం తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు.


Updated Date - 2022-04-23T00:40:11+05:30 IST