అమెరికాలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మృతి!

ABN , First Publish Date - 2020-09-27T00:20:24+05:30 IST

అమెరికాలోని వేదిక్ ఆశ్రమం ద్వారా అక్కడున్న వారికి కొద్ది దశాబ్దాలుగా వేద విద్యను భోదిస్తున్న ఆధ్యాత్మిక గురువు స్వామి ప్ర

అమెరికాలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మృతి!

వాషింగ్టన్: అమెరికాలోని వేదిక్ ఆశ్రమం ద్వారా అక్కడున్న వారికి కొద్ది దశాబ్దాలుగా వేద విద్యను బోధిస్తున్న ఆధ్యాత్మిక గురువు స్వామి ప్రత్యగ్బోధానంద.. గుండె పోటుతో ఈ నెల 20న మరణించారు. ఈ విషయాన్ని ఆయన అనుచరులు వెల్లడించారు. ఆర్ష వేదిక్ గురుకులమ్.. 34వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. ఆయన తీవ్రమైన ఛాతినొప్పితో బాధపడ్డట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆయనను దగ్గర్లోని  ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వామి ప్రత్యగ్బోధానంత తుదిశ్వాస విడిచారని ఆయన అనుచరులు వివరించారు. ఆయన పార్థీవదేహాన్ని ఇండియాకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.  కాగా.. స్వామి ప్రత్యగ్బోధానంద.. పెన్సిల్వేనియాలోని ఆర్ష విద్యా గురుకులానికి ఉపాధ్యక్షులుగా పని చేస్తున్నారు. ఈ ఆశ్రమాన్ని 1986లో స్వామి దయానంద సరస్వతి స్థాపించారు. 


Updated Date - 2020-09-27T00:20:24+05:30 IST