కలెక్టర్కు ఆత్మీయ వీడ్కోలు
ABN , First Publish Date - 2021-07-28T06:04:46+05:30 IST
కలెక్టర్ వీర పాండియన్కు జిల్లా అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు.
కర్నూలు(కలెక్టరేట్), జూలై 27: కలెక్టర్ వీర పాండియన్కు జిల్లా అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. కలెక్టర్గా రెండు సంవత్సరాల ఒక నెల 20 రోజులు విధులు నిర్వహించి బదిలీపై ఏపీ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా వెళుతున్న సందర్భంగా మంగళవారం రాత్రి కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఆయనకు సన్మానం చేశారు. కార్యక్రమంలో జేసీలు రాంసుందర్ రెడ్డి, డా.మనజీర్ జిలానీ సామూన్, ఎన్.మౌర్య, శ్రీనివాసులు, నగర పాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ తమీమ్ అన్సారీయా, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డీఆర్వో పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.