పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ABN , First Publish Date - 2022-06-30T06:04:34+05:30 IST
పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
షాద్నగర్ అర్బన్, జూన్ 29: ఫరూఖ్నగర్ మండలంలోని మొగిలిగిద్ధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1997-1998 విద్యాసంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఒకే చోటుకి చేరారు. మండలంలోని రాయికల్ గ్రామ సమీపంలోని ఎన్హెచ్-44 హోటల్లో బుధవారం సమావేశమయ్యారు. 24సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా అప్యాయంగా పలకరించుకుని రోజంతా సందడిగా గడిపారు. తమ గురువులు గోపాలస్వామి, శ్రీనివాస్, రామ్చందర్, లక్ష్మారెడ్డి, వెంకటేష్, లక్ష్మణ్, రాధాలను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు లక్ష్మయ్య, గోపాల్, ఖదీర్, సుందర్, యాదగిరి, నరేందర్, రహీం, ప్రవీణ్చారి, శంకర్నాయక్, రఘుగౌడ్, మల్లేష్, అంజయ్య, నాగలత పాల్గొన్నారు.