రెండో టెస్టుకు స్పిన్ పిచ్!
ABN , First Publish Date - 2021-12-02T08:23:46+05:30 IST
భారత్-న్యూజిలాండ్ జట్ల జరిగే రెండో టెస్టు కోసం స్పిన్ పిచ్ను తయారుచేస్తున్నట్టు సమాచారం. కాన్పూర్లో జరిగిన తొలి టెస్టు ఆసక్తికరంగా ..
ముంబై: భారత్-న్యూజిలాండ్ జట్ల జరిగే రెండో టెస్టు కోసం స్పిన్ పిచ్ను తయారుచేస్తున్నట్టు సమాచారం. కాన్పూర్లో జరిగిన తొలి టెస్టు ఆసక్తికరంగా సాగి చివరకు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణాయక టెస్టులో మాత్రం ఫలితం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ‘సొంతగడ్డపై భారత జట్టు స్పిన్ను ప్రధాన అస్త్రంగా భావిస్తుంది. అందుకే వాంఖడే పిచ్ను దీనికి అనుగుణంగానే తయారు చేయనున్నాం. ఇక్కడి వికెట్ తొలి రోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది’ అని ముంబై క్రికెట్ సంఘం వర్గాలు తెలిపాయి.