ప్రత్యేక ఓటరు జాబితా సవరణ
ABN , First Publish Date - 2020-08-13T07:38:36+05:30 IST
ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ) షెడ్యూల్ జారీ చేసింది
- దరఖాస్తు గడువు నవంబరు 15
- జనవరి 15న ఓటరు తుది జాబితా
- జనవరి1 నాటికి 18 ఏళ్లున్న వారు అర్హులు
హైదరాబాద్, ఆగ స్టు 12(ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ) షెడ్యూల్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) డాక్టర్ శశాంక్గోయెల్ బుధవారం సంబంధిత షెడ్యూల్ను విడుదల చేశారు. 2021 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారంద రూ ఓటరుగా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. సవరణ అనంతరం 2021 జనవరి 15న ఓటరు తుది జాబితా ప్రకటించనున్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు, జాబితా సవరణకు నవంబరు 30వరకు గడువు విధించారు.
10-08-2020-31-10-2020
పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ
01-11-2020-15-11-2020
దరఖాస్తు చేసుకునేందుకు గడువు
16-11-2020
ముసాయిదా జాబితా ప్రకటన
16-11-2020-15-12-2020
అభ్యంతరాల స్వీకరణకు గడువు
15-01-2021
ఓటరు తుది జాబితా ప్రకటన