దివ్యాంగుల కోసం ప్రత్యేక మాస్కులు

ABN , First Publish Date - 2020-05-19T22:19:37+05:30 IST

దివ్యాంగుల కోసం కోసం 81వేల మాస్కులను అందించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం..

దివ్యాంగుల కోసం ప్రత్యేక మాస్కులు

చెన్నై: దివ్యాంగుల కోసం కోసం 81వేల మాస్కులను అందించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటిచింది. ఈ మాస్కులన్నీ పారదర్శకంగా ఉంటాయని.. మాట్లాడడం, వినడంలో సమస్యలున్న వారికి ఇవి ఉపయోగపడతాయని తెలిపింది. సాధారణంగా వినికిడి, మాట్లాడడంలో లోపాలున్న వారు ఎదుటివారి పెదవుల కదలికల ఆధారంగా సంభాషిస్తారని, అయితే సాధారణ మాస్కుల ద్వారా ఇది సాధ్యం కాదని, అందుకోసమే ఈ మాస్కులను అందించనున్నట్లు తెలిపారు. ఈ మాస్కులను దివ్యాంగులతో పాటు వారి తల్లిదండ్రులకు, శిక్షకులు, ఉపాధ్యాయులు, సన్నిహితులకు అందించడం జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. దీనివల్ల వారితో సంభాషించడం దివ్యాంగులకు సులభమవుతుందని పేర్కొంది.


ఈ మాస్కులను పంపిణీ చేసే ప్రాజెక్టును తమిళనాడు దివ్యాంగుల సంక్షేమ శాఖ కమిషనరేట్ చేపట్టనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా స్థానిక సంక్షేమ శాఖల ద్వారా ఈ మాస్కులను ఆయా జిల్లాల్లోని దివ్యాంగులకు అందజేయడం జరుగుతుందని వివరించింది. ఈ మాస్కులను వారికి అందించిన తరువాత వారి అభిప్రాయాలను సేకరించి ఏవైనా మార్పులు అవసరమైతే చేయడం జరుగుతుందని తెలిపింది.

Updated Date - 2020-05-19T22:19:37+05:30 IST