నేటి నుంచి కొల్హాపూర్‌కు ప్రత్యేక రైలు

ABN , First Publish Date - 2020-10-28T18:13:40+05:30 IST

తిరుపతి-కొల్హాపూర్‌ పం డుగ స్పెషల్‌ రైలును ప్రతిరోజూ నడి పేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయిం చింది. 04715 నెంబరు గల..

నేటి నుంచి కొల్హాపూర్‌కు ప్రత్యేక రైలు

నవంబరు 18 వరకు నడిపేందుకు రైల్వే అధికారుల నుంచి ఉత్తర్వులు


కడప(ఎరముక్కపల్లె)/ఎర్రగుంట్ల: తిరుపతి-కొల్హాపూర్‌ పండుగ స్పెషల్‌ రైలును ప్రతిరోజూ నడి పేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయిం చింది. 04715 నెంబరు గల రైలు 28వ తేదీ బుధవారం రాత్రి 21.00 గంటల కు తిరుపతి నుంచి బయలుదేరనుంది. అలాగే 04716 నెంబరు గల కొల్హాపూర్‌ -తిరుపతి రైలు 30వ తేదీ ఉదయం 11.30 గంటలకు కొల్హాపూర్‌లో బయ లుదేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు తిరుపతికి చేరుకోనుంది. ఈ ప్రత్యేక రైళ్లు నవంబరు 18వ తేదీ వరకు నడపనున్నారు. రైలులో కేవలం రిజర్వేషన్‌ బోగీలు మాత్రమే ఉంటాయి. 


రైలు టైమింగ్స్‌

04715 (రాత్రి) 21.00 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి రేణిగుం టకు 21.20, కడపకు 23.18, ఎర్రగుం ట్లకు 00.03, తాడిపత్రికి 01.18, గుత్తికి 02.08, గుంతకల్‌కు 02.58, బళ్లారికి 04.20, తోరణగల్లుకు 04.54 గంటలకు, హొస్పేట్‌కు 05.30, కొప్పల్‌కు 06.14, గదగ్‌కు 07.13, హుబ్లికి 08.25, దార్వా డ్‌కు 09.04, అల్‌నావ 09.39, లోండా కు 10.24, ఖానాపుర్‌కు 10.49, బెల్గాం కు 11.25కు, రాయ్‌బాగ్‌కు 13.14, కుదా చికి 13.34, మీరజ్‌కు 14.55, హట్‌కలండ 15.39, కొల్హాపూర్‌కు 16.35 గంటలకు చేరుకోనుంది. 


04716 నెంబరు గల కొల్హాపూర్‌- తిరుపతి రైలు ఉదయం 11.30 గంటల కు కొల్హాపూర్‌ నుంచి  బయలుదేరి 19.10 గంటలకు హుబ్లికి, బళ్లారికి అర్ధ రాత్రి 00.28 గంటలకు, గుంతకల్‌కు 01.30 గంటలకు, గుత్తికి 02.13, ఎర్ర గుంట్లకు 04.03, కడపకు 04.53, రేణి గుంటకు 07.13, తిరుపతికి ఉదయం  08.00 గంటలకు చేరుకోనున్నది. ప్రస్తు తానికి నవంబరు 18వ తేదీ వరకు మాత్రమే నడుస్తుందని తెలిపినా ఈ రైలును అలాగే కొనసాగిస్తారని తెలు స్తోంది. 



Updated Date - 2020-10-28T18:13:40+05:30 IST