7నుంచి మదనపల్లె మీదుగా మరో ప్రత్యేక రైలు

ABN , First Publish Date - 2020-11-29T05:37:12+05:30 IST

రైల్వేశాఖ కొత్తగా డిసెంబర్‌ 7వ తేదీ నుంచి కేరళలోని నాగర్‌కోయిల్‌ నుంచి ముంబై వరకు ప్రత్యేక రైలును ప్రారంభించనుంది.

7నుంచి మదనపల్లె మీదుగా మరో ప్రత్యేక రైలు

మదనపల్లె టౌన్‌, నవంబరు 28: రైల్వేశాఖ కొత్తగా డిసెంబర్‌ 7వ తేదీ నుంచి కేరళలోని నాగర్‌కోయిల్‌ నుంచి ముంబై వరకు ప్రత్యేక రైలును  ప్రారంభించనుంది. రైలు నెంబరు 06340 నాగర్‌కోయిల్‌ నుంచి బయలుదేరి సాయంత్రం 7.45కు కాట్పాడి,  చిత్తూరుకు 8.40కు, పాకాలకు 9.20కి, మదనపల్లె రోడ్‌కు రాత్రి 11.08కి వచ్చి కదిరి మీదుగా ముంబై వెళుతుంది. అలాగే రైలు నెంబరు 06339 ముంబై నుంచి బయలుదేరి మదనపల్లె రోడ్‌(సీటీఎం)కు మధ్యాహ్నం 2.55కు చేరుతుంది. పాకాలకు సాయంత్రం 4.55కు, చిత్తూరుకు 5.40కు, కాట్పాడికి సాయంత్రం 6.15కు చేరుతుంది. వారంలో ప్రతి సోమవారం, మంగళ, బుధ, శుక్రవారాలు నాగర్‌కోయిల్‌ నుంచి బయలుదేరి ముంబైకు చేరుతుంది. అలాగే వారంలో మంగళ, బుధ, గురువారం, శనివారాల్లో ముంబై నుంచి నాగర్‌కోయిల్‌కు వెళుతుందని రైల్వేవర్గాలు తెలిపాయి.

Updated Date - 2020-11-29T05:37:12+05:30 IST