డ్రగ్స్ సరఫరాపై ప్రత్యేక నిఘా: మంత్రి శ్రీనివాస్గౌడ్
ABN , First Publish Date - 2022-04-05T00:26:16+05:30 IST
రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరాపై ప్రత్యేక నిఘా పెట్టామని ఎక్సైజ్ శాఖామంత్రి
హైదరాబాద్: రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరాపై ప్రత్యేక నిఘా పెట్టామని ఎక్సైజ్ శాఖా మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాడిసన్ బ్లూ పబ్ ఘటనపై మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా ABNతో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడంలో భాగంగానే రాడిసన్ పబ్పై పోలీసులు రైడ్ చేశారని ఆయన తెలపారు. నగరంలో డ్రగ్స్ సరఫరాపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. పబ్లో దొరికినవారు ఏ పార్టీతో సంబంధమున్నా వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. అనవసర ఆరోపణలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి ఆయన సవాల్ విసిరారు. ఏ పబ్లో డ్రగ్స్ వినియోగం ఉందో చెప్తే రైడ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పబ్స్ నడుస్తున్నాయనడం అవాస్తవమన్నారు. రాడిసన్ బ్లూ పబ్ ఘటనలో ఎవరున్నా వదిలేది లేదన్నారు. ఇలాంటి చర్యలకు రాజకీయాలు ఆపాదించడం సరికాదని ABNతో మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.