ప్రజల నిత్య దేవుడు ఆనంద గజపతిరాజు

ABN , First Publish Date - 2020-11-01T02:23:30+05:30 IST

మాన్సస్ ట్రస్ట్ నిత్య వివాదాల పుణ్యమా అని పూసపాటి రాజావార్ని ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. వారసుల మధ్య రాజకీయాలు రాజేసి పబ్బం గడుపుకుంటున్న..

ప్రజల నిత్య దేవుడు ఆనంద గజపతిరాజు

విజయనగరం: మాన్సస్ ట్రస్ట్ నిత్య వివాదాల పుణ్యమా అని పూసపాటి రాజావార్ని ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. వారసుల మధ్య రాజకీయాలు రాజేసి పబ్బం గడుపుకుంటున్న నేతను ఓ వైపు తిట్టుకుంటూనే మరోవైపు ఆనంద గజపతిరాజును మదిలో తలుచుకుంటున్నారు. అప్పట్లో ఆయన అందించిన సేవలను ఇప్పటి వివాదాలతో పోల్చుకుని ఎలాంటి వంశానికి ఎలాంటి పరిస్థితి దాపురించిందా? అని ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించే వారు. సొంత ఆస్తులను తనఖా పెట్టి ఎంపీజీఆర్‌ను ఏర్పాటు చేశారు. మహిళలంటే ఎంతో గౌరవం. ముఖ్యంగా మధ్య తరగతి మహిళ సొంత కాళ్లపై నిలబడాలని అంటూ ఉండేవారు. చిన్నారులు బాగా చదివి వృద్ధిలోకి రావాలని చెబుతూ ఉండేవారు. విజయనగరంలో ఎవర్ని అడిగిన ఆనందగజపతిరాజు గురించి చెప్పే మాటలివి. చూడటానికి చాలా సాధారణంగా ఉండేవారు. మృదుస్వభావి. పెద్ద జమిందార్ననే అహం ఆనందుడిలో అసలు కనిపించేవికావు.


విద్య నేర్చుకుంటే ఎంత గౌరవం పొందవచ్చునో తెలిసిన వాడు. అందుకే బాగా చదివి విద్యాధికుడు అయ్యాడు. దేశ, విదేశాల్లోని యూనివర్సిటీల నుంచి డాక్టరేట్లను సాధించారు. తాను చదువుకోవడమే కాదు ఊళ్లో అందరూ చదువుకోవాలని ఆశించిన వారు. విద్యానగరమని విజయనగరానికి ఉన్న పేరును సార్థకం చేయడానికి ఎంతకాలమో కృషి చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన యంగిస్థాన్ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని రేపటి తరానికి దిశానిర్దేశం చేశారు. 

Updated Date - 2020-11-01T02:23:30+05:30 IST