ప్రత్యేక హోదా ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-07-31T07:42:23+05:30 IST

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి డిమాండ్‌ చేశారు.

ప్రత్యేక హోదా ఇవ్వాలి
మాట్లాడుతున్న లక్ష్మణరెడ్డి

కేంద్రానికి జన చైతన్య వేదిక అధ్యక్షుడి డిమాండ్‌ 


తిరుపతి(తిలక్‌రోడ్డు), జూలై 30: ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి డిమాండ్‌ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నీరుగార్చిందని ఆరోపించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి పునరావాసంతో పాటు నిర్మాణానికి నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండు చేశారు. రాయలసీమ మేధావుల సంఘం అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడాన్ని అభినందించారు. విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో వెలుగొండ ప్రాజెక్టును పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజానేస్తం రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా కోసం అందరం కలసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు దేవరాజులు, రఫీ, కిరణ్‌కుమార్‌రెడ్డి, కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T07:42:23+05:30 IST