ఏకిరిపల్లెకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు : ఆర్టీసీ చైర్మన్
ABN , First Publish Date - 2022-01-24T04:58:37+05:30 IST
మండలంలో మారుమూల అటవీ ప్రాంతమైన ఏకిరిపల్లెకు ప్రత్యేక ఆర్టీసీ బస్సును నడపనున్నట్లు రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి వెల్లడించారు.
రాజంపేట, జనవరి 23 : మండలంలో మారుమూల అటవీ ప్రాంతమైన ఏకిరిపల్లెకు ప్రత్యేక ఆర్టీసీ బస్సును నడపనున్నట్లు రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి వెల్లడించారు. ఆదివారం ఏకిరిపల్లెలో జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాధరెడ్డితో కలిసి ఆ గ్రామాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ జెడ్పీ చైర్మన్ అమర్నాధరెడ్డి, వైసీపీ నేత ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి ఈ గ్రామానికి బస్సు నడపాలని కోరారన్నారు. దీంతో ప్రతి రోజూ రెండు సార్లు గ్రామానికి బస్సు నడపనున్నట్లు వెల్లడించారు.