కాల భైరవస్వామికి ఆర్టీసీ చైర్మన్‌ ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-11-29T05:23:15+05:30 IST

ఇసన్నపల్లి-రామారెడ్డి మధ్యలో వెలసిన కాల భైరవస్వామి ఆలయంలో ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాల భైరవస్వామికి ఆర్టీసీ చైర్మన్‌ ప్రత్యేక పూజలు
కాలభైరవ స్వామి ఆలయంలో స్వామి వారికి పూజ చేస్తున్న ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడి ్డగోవర్ధన్‌

సదాశివనగర్‌, నవంబరు 28: ఇసన్నపల్లి-రామారెడ్డి మధ్యలో వెలసిన కాల భైరవస్వామి ఆలయంలో ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు అతిథులకు శాలువాలతో సన్మానించారు. నాలుగు రోజులుగా స్వామి వారి జన్మదిన వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చివరిరోజైన ఆదివారం తెల్లవారు జామున దక్ష యజ్ఞం, అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ ఉప్పు సంతోష్‌ గుప్తా, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-29T05:23:15+05:30 IST