తోటపల్లిలో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-02-25T05:18:20+05:30 IST

తోటపల్లి శ్రీవెంకటే శ్వర, కోదండ రామస్వామి ఆలయాల్లో బుధవా రం ప్రత్యేక పూజలు నిర్వహిం చారు.

తోటపల్లిలో ప్రత్యేక పూజలు

గరుగుబిల్లి, ఫిబ్రవరి 24: తోటపల్లి శ్రీవెంకటే శ్వర, కోదండ రామస్వామి ఆలయాల్లో బుధవా రం ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు సుప్రభాత సేవ, నిత్యా రాధన, విశేష హోమాలు, మంగళా శాస నములతో పాటు పలు పూజలను ఆలయ అర్చకులు వీవీ అప్పలాచార్యులు, పి.గోపాల కృష్ణమాచార్యులు నిర్వహించారు. ఆలయ ఈవో బీఎల్‌ నగేష్‌ మాట్లా డుతూ ముగింపు రోజు పురస్కరించుకుని ఈ నెల 27న పవిత్ర నాగావళి నదీ తీరంలో స్వామివారికి శ్రీచూర్ణోత్సవం, శ్రీచక్ర తీర్ధ స్నానం అత్యంత వైభవంగా నిర్వహిం చనున్నట్లు తెలిపారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధికంగా పాల్గొ నాలని కోరారు. మంగళవారం రాత్రి నిర్వహించిన కల్యాణానికి భక్తులు అధికంగా తరలివచ్చారన్నారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు ఉచిత ప్రసాదాలను ఆలయ సిబ్బంది ఎం.మురళీమో హన్‌నాయుడు అందించారు.


Updated Date - 2021-02-25T05:18:20+05:30 IST