బీచుపల్లి క్షేత్రంలో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-05-16T05:35:22+05:30 IST

బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బీచుపల్లి క్షేత్రంలో ప్రత్యేక పూజలు
హోమం చేస్తున్న వేద పండితులు

ఇటిక్యాల,మే 15: బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామి వారికి ఆకు పూజ, నైవేద్యంతో పాటు పంచామృతాభిషేకం, స్వామివారి ఉపనయనం, హోమం, ప్రభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాలనుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం స్వామి వారి రథోత్సవం, సీతారాముల కల్యాణం ఉండటంతో ఆలయంలో ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఈవో రామన్‌గౌడ్‌ తెలిపారు. వేలాది మంది భక్తులు రథోత్సవాన్ని తిలకించేందుకు వస్తుండడంతో ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు ఆయన వివరించారు. 

Updated Date - 2022-05-16T05:35:22+05:30 IST