ఆలయాల్లో ప్రత్యేక హోమాలు, పూజలు

ABN , First Publish Date - 2020-03-28T10:41:07+05:30 IST

కోటసత్తెమ్మ ఆలయంలో మానవాళి క్షేమం కోరుతూ శుక్రవారం దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో విశ్వశాంతి హోమం...

ఆలయాల్లో ప్రత్యేక హోమాలు, పూజలు

నిడదవోలు, మార్చి 27 : కోటసత్తెమ్మ ఆలయంలో మానవాళి క్షేమం కోరుతూ శుక్రవారం దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో విశ్వశాంతి హోమం నిర్వహించారు. కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో దానిని నిరోధించే చర్యలు సఫలం కావాలని, సమస్త మానవాళి క్షేమంగా ఉండాల ని హోమం నిర్వహించినట్టు ఆలయ ఈవో బళ్ల నీలకంఠం తెలిపారు.


సర్వశాంతి హోమం

ద్వారకాతిరుమల, మార్చి 27 : కరోనా విపత్తు నుంచి బయటపడాలని  వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం సర్వశాంతి హోమం నిర్వహిం చారు. ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. 

Updated Date - 2020-03-28T10:41:07+05:30 IST