మహిళలకు యశోద ఆస్పత్రి ప్రత్యేక ప్యాకేజీ
ABN , First Publish Date - 2021-03-07T12:08:23+05:30 IST
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
హైదరాబాద్ : ఫ్రంట్లైన్ వారియర్స్ అయిన మహిళా పోలీసులు, వైద్యులకు ‘మహిళ సంరక్షణ ప్రత్యేక ప్యాకేజీ’ని యశోద ఆస్పత్రి ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రూ. 5,210 విలువ గల ఆరోగ్య పరీక్షలను కేవలం ప్యాకేజీలో ఉచితంగా అందిస్తున్నట్లు యశోద ఆస్పత్రుల డైరెక్టర్ డాక్టర్ పవ న్ గోరుకంటి తెలిపారు. అలాగే మిగతా మహిళందరికీ ఈ పథకంలో రూ. 999లకే ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకంలో కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఈస్ఆర్, రాండమ్ బ్లడ్ షుగర్, థైరాయిడ్ ప్రొఫైల్ (టీ3, టీ4, అండ్ టీఎస్మెచ్), కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, పాప్స్ స్మేర్ పరీక్షలతో పాటు గైనకాలజీ కన్సల్టేషన్, డాక్టర్ సలహా మేరకు ఒకవేళ అవసరమైతే మామోగ్రఫీ టెస్టులు కూడా చేస్తారు. ఈ అవకాశం ఈ నెల 8వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు తమ పేర్ల నమోదు కోసం 040-45674567 నంబర్లకు ఫోన్ చేసి నమో దు చేసుకోవాలని ఆయన సూచించారు.