దుబ్బాక ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడి నియామకం

ABN , First Publish Date - 2020-10-28T21:42:39+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నికలో కమలం-కారు మధ్య నోట్ల కట్లల వ్యవహారం తీవ్ర రాజకీయం దుమారం రేపింది. ఇరుపార్టీలు ఆరోపణలు-ప్రత్యారోపణలతో ఎన్నికల ప్రచారం హీటెక్కించారు. మరోవైపు బీజేపీ, టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి

దుబ్బాక ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడి నియామకం

హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికలో కమలం-కారు మధ్య నోట్ల కట్లల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఇరుపార్టీలు ఆరోపణలు-ప్రత్యారోపణలతో ఎన్నికల ప్రచారం హీటెక్కించాయి. మరోవైపు బీజేపీ, టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడిని సీఈసీ నియమించింది. నోట్ల కట్టల కలకలంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడుకు చెందిన సీనియర్ ఐపీఎస్ సరోజ్ కుమార్‌ను నియమించింది. మొత్తం వ్యవహారాన్ని స్పెషల్ ఆఫీసర్ సమీక్ష చేయనున్నారు. 



Updated Date - 2020-10-28T21:42:39+05:30 IST