ఆక్వా ఉత్పత్తులు దెబ్బతినకుండా ప్రత్యేక చర్యలు: మోపిదేవి
ABN , First Publish Date - 2020-04-03T20:29:31+05:30 IST
ఆక్వా ఉత్పత్తులు దెబ్బతినకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, రైతులకు మద్దతు ధర ఇవ్వాలని సీఎం జగన్ చెప్పారని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు.
అమరావతి: ఆక్వా ఉత్పత్తులు దెబ్బతినకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, రైతులకు మద్దతు ధర ఇవ్వాలని సీఎం జగన్ చెప్పారని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూలీలకు సీఎం సాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రాసెసింగ్ యూనిట్స్కి కూలీలు దొరకడం లేదని, వ్యవసాయ, ఆక్వా రంగాన్ని మినహాయించాలన్నారు. దళారుల మాటలు నమ్మి తొందరపడి రొయ్యలను అమ్మకానికి పెట్టొద్దని మోపిదేవి వెంకటరమణ సూచించారు.