పెట్టుబడుల కోసం ప్రత్యేక గ్రూపులు
ABN , First Publish Date - 2020-06-04T06:00:06+05:30 IST
ర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు పెద్ద ఎత్తున దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు రెండు ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిమండలి సమావేశం...
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు పెద్ద ఎత్తున దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు రెండు ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. కార్యదర్శుల సాధికార గ్రూపు (ఈజీఓఎస్), ప్రాజెక్టుల అభివృద్ధి సెల్ (పీడీసీ) పేరుతో ఈ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. చైనాలోని అనేక విదేశీ కంపెనీలు ఆ దేశానికి గుడ్బై చెప్పే యోచనలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేయడం విశేషం.