మునిసిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు

ABN , First Publish Date - 2022-01-27T05:08:01+05:30 IST

మునిసిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు

మునిసిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
పరిగి మునిసిపాలిటీకి ట్రాక్టర్‌ను అందజేస్తున్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

పరిగి, జనవరి 26: పరిగి మునిసిపల్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకవస్తానని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం  మున్సిపాలిటీకి కొత్తగా తీసుకొచ్చిన నాలుగు చెత్త వాహనాలు, ఒక ట్రాక్టర్‌ను మునిసిపల్‌ అధికారులకు అప్పగించారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ పరిగి పట్టణాన్ని స్వచ్ఛపట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఇప్పటికే పరిగిలో రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ఇంకా అవసరం ఉన్న మేరకు నిధులు మంజూరు చేయిస్తామన్నారు. పట్టణంలో వార్డుకో చెత్తబండిని ఇచ్చామని, ప్రజలు చెత్తను ఇంటి పరిసరాల్లో వేయకుండా బండ్లలో వేసి మునిసిపల్‌ సిబ్బందికి సహకరించాలని కోరారు. మునిసిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌, జడ్పీటీసీ బి.హరిప్రియ, పిఏసీఎస్‌ చైర్మన్‌ కె.శ్యాంసుందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌, నాయకులు ఆర్‌.ఆంజనేయులు, బి.ప్రవీన్‌రెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2022-01-27T05:08:01+05:30 IST