శివారు కాలనీల్లో మౌలిక వసతులకు ప్రత్యేక నిధులు

ABN , First Publish Date - 2021-12-01T05:09:41+05:30 IST

పటాన్‌చెరు శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలసిన కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు.

శివారు కాలనీల్లో మౌలిక వసతులకు ప్రత్యేక నిధులు
పటేల్‌గూడ పంచాయతీ పరిధిలో సీసీరోడ్లకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే గూడెంమహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు, నవంబరు 30 : పటాన్‌చెరు శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలసిన కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. పటేల్‌గూడ పంచాయతీ పరిధిలోని సిద్ధార్థ కాలనీలో సీసీరోడ్లకు మంగళవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. వేగంగా హైదరాబాద్‌ నగరం విస్తరిస్తోందన్నారు. పెరుగుతున్న కాలనీలు, జనావాసాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు. ట్రాఫిక్‌ రద్దీ తగ్గించేందుకు బీరంగూడ కమాన్‌ నుంచి కిష్టారెడ్డిపేట వరకు రూ.50 కోట్లతో చేపట్టిన వంద ఫీట్ల రోడ్డు పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈర్ల దేవానందం, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, నాయకులు జ్ఞానేశ్వర్‌, శ్రీకాంత్‌, సుశీల్‌దాస్‌, వార్డుసభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-01T05:09:41+05:30 IST