ట్రంప్ కోసం ప్రత్యేక వంటకాలు..!

ABN , First Publish Date - 2020-02-24T00:46:03+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా మరికొద్ది గంటల్లో భారత్‌కు చేరుకోనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆ

ట్రంప్ కోసం ప్రత్యేక వంటకాలు..!

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా మరికొద్ది గంటల్లో భారత్‌కు చేరుకోనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్ దంపతులు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ దంపతులకు గుజరాతీ వంటకాలను రుచి చూపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెఫ్ సురేశ్ ఖన్నా నేతృత్వంలోని టీం.. ట్రంప్ దంపతుల కోసం ప్రత్యేకంగా వంటకాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా గుజరాతీ స్పెషల్ ఖమన్ ధోక్లా, స్పెషల్ జింజర్ టీ, బ్రోకలీ, కార్న్ సమోసా, ఐస్ టీ, గ్రీన్ టీ, స్పెషల్ కుకీస్‌తో పాటు ప్రత్యేకంగా మిఠాయిలను కూడా తయారు చేసినట్లు సురేశ్ ఖన్నా వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా.. వీటిని మొదటగా అమెరికా సెక్యూరిటీ సిబ్బంది, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు తిన్న తర్వాతే ట్రంప్ దంపతులకు వడ్డించనున్నట్లు సురేశ్ కన్నా పేర్కొన్నారు. కాగా..మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం వంటకాలను సిద్ధం చేసిన అనుభవం సురేశ్ ఖన్నాకు ఉంది. కాగా.. అమెరికా అధ్యక్షుడి కోసం వంటకాలను సిద్ధం చేసే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు సురేశ్ ఖన్నా తెలిపారు. 

Updated Date - 2020-02-24T00:46:03+05:30 IST