పీసా చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి
ABN , First Publish Date - 2021-02-27T05:37:49+05:30 IST
పీసా చట్టం అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని గిరిజన సంక్షేమశాఖ లీగల్ సలహాదారులు పల్లా త్రినాథరావు కోరారు.
పార్వతీపురం, ఫిబ్రవరి 26: పీసా చట్టం అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని గిరిజన సంక్షేమశాఖ లీగల్ సలహాదారులు పల్లా త్రినాథరావు కోరారు. శుక్రవారం స్థానిక గిరిమిత్ర సమావేశ మందిరంలో పీసా చట్టం అమలుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హాజరైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో త్రినాఽథరావు మాట్లాడుతూ గిరిజన సంక్షేమశాఖ పీసా చట్టం అమలు కోసం రూపొందించిన నియమాలను వివరించారు. నియమాల అమలుకు కార్యాచరణ మార్గదర్శకాలు, గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అందించవలసిన సమాచారంపై వివరించారు. కార్యక్రమంలో ఏపీవో సురేష్కుమార్, డీడీ కిరణ్కుమార్తో పాటు వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.