కుప్పంలో బెడిసికొడుతున్న వైసీపీ వ్యూహాలు

ABN , First Publish Date - 2021-11-13T23:41:51+05:30 IST

కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారం సమయం ముగిసినా ..

కుప్పంలో బెడిసికొడుతున్న వైసీపీ వ్యూహాలు

చిత్తూరు: కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారం సమయం ముగిసినా కూడా అధికార పార్టీకి చెందిన నాన్ లోకల్ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు యత్నిస్తున్నారు. నామినేషన్ల పర్వం నుంచి విత్ డ్రాలకు వరకూ కూడా వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ముఖ్యంగా కుప్పం 14వ వార్డులో ఏకగ్రీవం కోసం వైసీపీ నేతలు బీభత్సం సృష్టించింది. టీడీపీ నేతలు అప్రమత్తం కావడం, ఆందోళనకు దిగడంతో వారిపై కేసులు పెట్టారు. దీంతో టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.



Updated Date - 2021-11-13T23:41:51+05:30 IST