Rajendranagarలో రవాణా శాఖ అధికారుల స్పెషల్ డ్రైవ్

ABN , First Publish Date - 2022-06-14T14:28:09+05:30 IST

రాజేంద్రనగర్‌లో రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

Rajendranagarలో రవాణా శాఖ అధికారుల స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్: నగరంలోని  రాజేంద్రనగర్‌లో రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో స్కూల్ బస్సులపై ప్రత్యేక దృష్టిసారించారు. నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు పాటించని దాదాపు 10 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. ఫిట్‌నెస్ లేకుండా పలు పాఠశాలల బస్సుల్లో విద్యార్థులను రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

Updated Date - 2022-06-14T14:28:09+05:30 IST