లక్ష్మీ నరసింహుడికి ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2021-10-24T06:16:39+05:30 IST
మండలంలోని తరిగొండలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు.
గుర్రంకొండ, అక్టోబరు 23: మండలంలోని తరిగొండలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఉదయాన్నే స్వామి వారిని మేల్కొలిపి ఆలయశుద్ధి, తోమాలసేవ, అర్చన, పంచామృతాలతో అభిషేకాలను ఘనంగా చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేశారు. స్వామివారికి అభిషేకాలను చేయించడానికి భక్తులు అధికంగా వచ్చారు.