శాస్త్రోక్తంగా రాహుకాల పూజలు

ABN , First Publish Date - 2021-07-31T06:56:49+05:30 IST

బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం శాస్త్రోక్తంగా రాహుకాల పూజలు నిర్వహించారు.

శాస్త్రోక్తంగా రాహుకాల పూజలు

చౌడేపల్లె, జూలై 30 : బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం శాస్త్రోక్తంగా రాహుకాల పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు ఆలయాన్ని శుద్ధిచేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి దర్శనం కల్పించారు. ఆషాడ మాస శుక్రవారం కావటంతో అధిక సంఖ్యలో భక్తులు రాహుకాల పూజల్లో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యాలను ఆలయ చైర్మన్‌ మిద్దింటి శంకరనారాయణ, ఈవో చంద్రమౌళి పర్యవేక్షించారు. 

Updated Date - 2021-07-31T06:56:49+05:30 IST