వేధింపుల ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ
ABN , First Publish Date - 2022-01-08T23:54:45+05:30 IST
నగరంలో కలకలం రేపిన లైంగిక వేధింపుల ఘటనపై
విజయవాడ: నగరంలో కలకలం రేపిన లైంగిక వేధింపుల ఘటనపై ఫిర్యాదు చేసిన బాధితురాలిని డెంటల్ హౌస్ సర్జన్గా గుర్తించారు. బాధితురాలిని ప్రభుత్వ డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ విచారిస్తున్నారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు. పై అధికారుల ఆదేశాలతో వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్ గౌతమ్ శ్రీవాత్సవ్పై లిఖిత పూర్వక ఫిర్యాదు వచ్చిందని ప్రిన్సిపాల్ తెలిపారు. రమేష్ పై నోటి మాట ద్వారానే ఫిర్యాదు చేశారన్నారు. పూర్తిస్థాయి విచారణ చేసి పై అధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
విజయవాడ: బెజవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో వేధింపులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. బీడీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపట్ల అసిస్టెంట్ ప్రొఫెసర్ అసభ్య ప్రవర్తనపై డీఎంఈకి ఫిర్యాదు అందినట్లు తెలుస్తో్ంది. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిన అసిస్టెంట్ ప్రొఫెసర్ గౌతమ్గా సిబ్బంది చెబుతున్నారు. దీంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ (DME)కి ఫిర్యాదు విద్యార్థిని చేసింది. దీంతో శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. తొలుత పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది. కళాశాల ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ ఆధ్వర్యంలో వివరాలను సేకరిస్తున్నారు.