రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులు
ABN , First Publish Date - 2020-06-07T08:13:52+05:30 IST
విశాఖ రైల్వేస్టేషన్ నుంచి శ్రీకాకుళం, విజయనగరం వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుండంతో పీటీడీ
ద్వారకాబస్స్టేషన్, జూన్ 6: విశాఖ రైల్వేస్టేషన్ నుంచి శ్రీకాకుళం, విజయనగరం వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుండంతో పీటీడీ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నది. గోదావరి, ఫలక్నుమా, కోణార్క్, హౌరా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లు నగరానికి వస్తున్నాయి. ఈ ప్రయాణికులలో శ్రీకాకుళం, విజయనగరం, పలాస, సోంపేట, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఉంటున్నారు. రైళ్లు వచ్చే సమయానికి రైల్వేస్టేషన్ బస్టాపులో బస్సులు నిలిపి, వచ్చిన ప్రయాణికులకు అక్కడే థర్మల్ స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం రైల్వే స్టేషన్ నుంచి ఎనిమిది బస్సులు శ్రీకాకుళానికి, 12 బస్సులు విజయనగరానికి నడిపారు.