సచివాలయ పరీక్షలకు ప్రత్యేక బస్సులు

ABN , First Publish Date - 2020-09-19T11:10:07+05:30 IST

జిల్లాలో ఈనెల 20 నుంచి 26 వరకు జరిగే సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల కోసం సాలూరు డిపో నుంచి 9 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ

సచివాలయ పరీక్షలకు ప్రత్యేక బస్సులు

సాలూరు రూరల్‌: జిల్లాలో ఈనెల 20 నుంచి 26 వరకు జరిగే సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల కోసం సాలూరు డిపో నుంచి 9 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ సాలూరు డిపో మేనేజర్‌ గౌతం చటర్జీ, సహాయ డిపో మేనేజర్‌ కృష్ణ శుక్రవారం చెప్పారు. జిల్లాలో బొబ్బిలి, పార్వతీపురం, విజయనగ రం, గజపతినగరం, ఎస్‌.కోట కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్టు తెలి పారు.


బొబ్బిలిలో కేంద్రాలకు అభ్యర్థులు చేరుకునేందుకు తొమ్మిది ప్రత్యేక బస్సు లు, బాడంగి, సాలూరు, మక్కువలనుంచి బొబ్బిలికి రెండుచొప్పున ప్రత్యేక సర్వీసులు నడుపుతామని తెలియజేశారు. బొబ్బిలి నుంచి బలిజిపేట, తెర్లాం నుంచి బొబ్బిలి, పాచిపెంట నుంచి బొబ్బిలికి ఒక్కొక్కటి ప్రత్యేక సర్వీసులను పరీక్షల కోసం నడుపుతామని చెప్పారు. రెగ్యులర్‌ సర్వీసుల కింద పార్వతీపురానికి మూడు, విజయనగరానికి ఐదు సర్వీసులను యథావిధిగా నడుపుతామన్నారు. 

Updated Date - 2020-09-19T11:10:07+05:30 IST