డ్రైనేజీ వ్యవస్థ పటిష్ఠతకు ప్రత్యేక చర్యలు
ABN , First Publish Date - 2021-07-28T04:27:04+05:30 IST
నాయుడుపేట మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు.
ఎమ్మెల్యే కిలివేటి
నాయుడుపేట, జూలై 27 : నాయుడుపేట మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. ఆయన మంగళ వారం పట్టణంలోని 7వ వార్డులో అధికారులతో కలిసి జరిగిన అభివృద్ధి పనులు పరిశీలిం చారు. అనంతరం డ్రైనేజీ వ్యవస్థ పటిష్ఠత కోసం అధికారులతో చర్చించారు. ప్రజలతో మాట్లాడి అవసరమైన మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ ఏఈ జానకిరామిరెడ్డి, నాయకులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, కట్టా రమణారెడ్డి, కొండూరు రామకృష్ణరాజు, కటకం జయరామయ్య, మద్దాలి సోమశేఖర్రెడ్డి, గంధవల్లి సిద్దయ్య, బైనా మల్లికార్జున రెడ్డి, గంధవల్లి భరత్కుమార్, అశోక్, పోట్లపూడి రాజేష్, రాజశేఖర్రెడ్డి, షబ్బీర్, న్యాయవాది పసల చెంగయ్య, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.