స్థాయికి మించి మాట్లాడుతున్న సజ్జల: బుద్దా

ABN , First Publish Date - 2020-02-20T10:30:45+05:30 IST

‘‘ప్రభుత్వ సలహాదారుగా గౌరవప్రదమైన పదవిలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ నాయకుడిలాగా దిగజారి మాట్లాడుతున్నారు. బాగా చదువుకున్న సజ్జల మాజీ సీఎం...

స్థాయికి మించి మాట్లాడుతున్న సజ్జల: బుద్దా

విజయవాడ, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వ సలహాదారుగా గౌరవప్రదమైన పదవిలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ నాయకుడిలాగా దిగజారి మాట్లాడుతున్నారు. బాగా చదువుకున్న సజ్జల మాజీ సీఎం చంద్రబాబుపై అవాకులు, చవాకులు మాట్లాడటం సిగ్గుచేటు. ఆయన స్థాయికి మించి మాట్లాడుతున్నా.. చంద్రబాబుపై ఆయన చేసిన ప్రతి విమర్శకు తమ దగ్గర సమాధానాలున్నాయి.


మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమా?’’ అని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సవాల్‌ విసిరారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. నవరత్నాల పేరుతో ప్రజలను నయవంచనకు గురి చేసిన జగన్‌ రాష్ట్రాన్ని సరైన విధానంలో నడిపించడంలో విఫలమయ్యారని బుద్దా విమర్శించారు. ‘‘చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర అనగానే శుక్రవారం బ్యాచ్‌కి వెన్నులో వణుకు మొదలైనట్లుంది. కంగారులో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు పాపం’’ అంటూ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-02-20T10:30:45+05:30 IST