ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన స్పీకర్‌ పోచారం

ABN , First Publish Date - 2021-11-28T03:43:24+05:30 IST

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడ్డారు. జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో..

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన స్పీకర్‌ పోచారం

హైదరాబాద్‌: స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడ్డారు. జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో ఈ నెల 24న కోవిడ్ పరీక్షలు చేయించారు. పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొంది తాజాగా డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరికొన్ని రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు ఆయన హోంక్వారంటైన్‌లో ఉండనున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. 


Updated Date - 2021-11-28T03:43:24+05:30 IST