మహాత్మునికి నివాళులర్పించిన శాసనసభాపతి

ABN , First Publish Date - 2022-01-30T23:20:53+05:30 IST

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం శాసనసభ ఆవరణలోని ఆయన విగ్రహానికి శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

మహాత్మునికి నివాళులర్పించిన శాసనసభాపతి

హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం శాసనసభ ఆవరణలోని  ఆయన విగ్రహానికి శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన గాంధీజీ సిద్ధాంతాలు,స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్పూర్తిగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రొటెం చైర్మన్ హసన్ జాఫ్రి, శాసన వ్యవహారాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, విప్ ఇన్ కౌన్సిల్ ఎంఎస్ ప్రభాకర్ , లేజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-30T23:20:53+05:30 IST