అసెంబ్లీ నిరవధిక వాయిదా
ABN , First Publish Date - 2020-09-17T07:37:21+05:30 IST
అసెంబ్లీ నిరవధిక వాయిదా
కరోనా కారణంగానే: స్పీకర్ పోచారం
శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కరోనా తీవ్రత నేపథ్యంలో ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివా్సరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వేర్వేరుగా ప్రకటించారు. ఈ సమావేశాల్లో రెవెన్యూ బిల్లుతోపాటు మరో 12 బిల్లులు ఆమోదం పొందాయన్నారు. సహకరించిన సభ్యులు, అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు.