మాట తప్పిన.. మడం తిప్పిన జగన్
ABN , First Publish Date - 2020-11-30T06:17:49+05:30 IST
మాట తప్పిన.. మడం తిప్పిన జగన్
కంకిపాడు, నవంబరు 29 : ప్రత్యేక హోదాతో పాటు అనేక అంశాలలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట తప్పి.. మడం తిప్పారని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్.. 23 మంది ఎంపీలతో ప్రధాని మోదీ ముందు మోకరిళ్లడం సిగ్గుచేటన్నారు. పోలవరం ప్రాజెక్టు మాటేలేదన్నారు. రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎంపీపీ దేవినేని రాజా, మాజీ జడ్పీటీసీ సభ్యుడు శివరామకృష్ణ ప్రసాద్, మాజీ ఏఎంసీ చైర్మన్ సుదిమళ్ల రవీంద్ర, సీహెచ్సీ మాజీ చైర్మన్ యలమంచిలి కిషోర్ బాబు, బొప్పూడి శివరామకృష్ణ, పులి శ్రీనివాసరావు, కొండా నాగేశ్వరరావు, అన్నే రామారావు పాల్గొన్నారు.