ఎస్పీబీ మృతి తీరని లోటు: ప్రవాసాంధ్రులు

ABN , First Publish Date - 2020-09-27T08:51:31+05:30 IST

ప్రముఖ సినీ గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల మన్నలను పొందారు...

ఎస్పీబీ మృతి తీరని లోటు: ప్రవాసాంధ్రులు

గుంటూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల మన్నలను పొందారు. నాలుగు దశాబ్ధాల నుంచి విదేశాల్లోని ప్రవాసాంధ్రులు ఆయాప్రాంతాల్లో ఏర్పాట్లు చేసిన అనేక కార్యక్రమాలకు హాజరయ్యారు. తానా, నాటా, పలు ఇతర సంస్థలు బాలుని అనేక సార్లు సత్కరించాయి. తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్‌, డాక్టర్‌ బండ్ల హనుమయ్య, నాదెండ్ల గంగాధర్‌, డాక్టర్‌ జంపాల చౌదరి, డల్లా్‌సకు చెందిన వెన్నం మురళీ తదితరులు బాలుతో సన్నిహితంగా ఉండేవారు. బాలు అనేక దేశాల్లో తెలుగు పాటల పోటీలు నిర్వహించారు. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి ఎంతోలోటని ప్రవాసాంధ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-09-27T08:51:31+05:30 IST