కరోనా వైరస్, ఒమైక్రాన్ పట్ల ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ సూచించారు.
ABN , First Publish Date - 2022-01-18T05:45:19+05:30 IST
కరోనా వైరస్, ఒమైక్రాన్ పట్ల ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ సూచించారు.
కరోనా, ఒమైక్రాన్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
ఏలూరు క్రైం, జనవరి 17 : కరోనా వైరస్, ఒమైక్రాన్ పట్ల ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ సూచించారు. ప్రతీ సోమవారం నిర్వ హించే స్పందన కార్యక్రమాన్ని ఎస్పీ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించగా జిల్లా నలుమూలల నుంచి పలువురు ఫిర్యాదు దారులు వచ్చి సమస్యలపై ఫిర్యాదులు అం దించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కొవిడ్ కేసులు పెరుగుతు న్నందున ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించి, శానిటైజర్తో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా వ్యాపార సముదాయాల వద్ద కొవిడ్ నిబం ధనలు పాటించాలని, మాస్క్ లేనిదే ఎవరినీ అనుమతించవద్దని, షాపుల్లోకి ఎక్కువ మందిని అనుమతించవద్దని సూచి ంచారు. బహిరంగ ప్రదేశాల్లో కూడా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిం చాలన్నారు. ఏలూరుటూటౌన్ పరిధి నుంచి ఓ వ్యక్తి వచ్చి తన భార్య మరణానికి కార ణంగా తనను అరెస్టు చేశారని, తన కుమార్తెను తనకు ఇవ్వకుండా వేధిస్తున్నా రంటూ ఫిర్యాదు చేశాడు. వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్టప్రకారం విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్పీ వారికి సూచించారు.