రేపు ‘స్పందన’
ABN , First Publish Date - 2021-07-25T05:17:31+05:30 IST
ఈనెల 26న జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు.
ఏలూరు, జూలై 24(ఆంధ్రజ్యోతి): ఈనెల 26న జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ స్పందన కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. కలెక్టరేట్తో పాటు అన్ని డివిజినల్ కార్యాలయాలు, మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ‘స్పందన’ కార్యక్రమం ఉంటుందని ఆయన ఆ ప్రకటనలో చెప్పారు.