పాడైన టాయిలెట్లు.. డైపర్లు వాడుతున్న వ్యోమగాములు..!
ABN , First Publish Date - 2021-11-08T03:27:52+05:30 IST
తమ వ్యోమనౌకలో టాయిలెట్లు పాడవడంతో డైపర్లు వాడుతున్న స్పేస్ఎక్స్ సంస్థ వ్యోమగాములు అలాగే తిరుగు ప్రయాణం ప్రారంభించనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తమ వ్యోమనౌకలో టాయిలెట్లు పాడవడంతో డైపర్లు వాడుతున్న స్పేస్ఎక్స్ సంస్థ వ్యోమగాములు అలాగే తిరుగు ప్రయాణం ప్రారంభించనున్నారు. ఇప్పటివరకూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన వారు ఆదివారం నాడు భూమికి తిరిగొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారి క్యాప్సూల్లో టాయిలెట్ లీకైనట్టు వెలుగులోకి వచ్చింది. ఆ టాయిలెట్ ఇక వినియోగానికి పనికి రాకుండా అయిపోవడంతో వారు డైపర్లు వినియోగిస్తున్నారు. అయితే..పాడైన టాయిలెట్ కారణంగా మలమూత్రాలు అక్కడ లీకైనట్టు తెలుస్తోంది. దీని వల్ల వ్యోమనౌకకు నష్టం ఏమైనా జరిగిందా అని ఇంజినీర్లు పరిశీలించి..అది సురక్షితంగానే ఉన్నట్టు తేల్చారు. అంతేకాకుండా.. ఆదివారం నాడు వారి తిరుగు ప్రయాణానికి ఏర్పాటు చేశారు.