వేదాయపాలెం స్టేషనలో ఎస్పీ తనిఖీలు

ABN , First Publish Date - 2022-10-04T05:39:04+05:30 IST

నగరంలోని వేదాయపాలెం పోలీసు స్టేషనను సోమవారం ఎస్పీ విజయరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

వేదాయపాలెం స్టేషనలో ఎస్పీ తనిఖీలు
వేదాయపాలెం స్టేషనను పరిశీలిస్తున్న ఎస్పీ విజయరావు

ఎస్‌ఐ, మరో 10 మందికి చార్జ్‌మెమోలు

వీఆర్‌కు స్టేషన రైటర్‌


నెల్లూరు (క్రైం), అక్టోబరు 3 : నగరంలోని వేదాయపాలెం పోలీసు స్టేషనను  సోమవారం ఎస్పీ విజయరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషనలోని క్రైం రికార్డులు, డ్యూటీ రోస్టర్‌, జీడీలను పరిశీలించారు. మిస్సింగ్‌, దొంగతనం, పెండింగ్‌ కేసుల వివరాలను ఎస్‌ఐ శ్రీహరిని అడిగి తెలుసుకున్నారు. విధుల్లో అలసత్వం వహించిన స్టేషన రైటర్‌ సురేష్‌ను వీఆర్‌లో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు. ఇక ఎస్‌ఐ శ్రీహరితోపాటు 10 మంది సిబ్బందికి చార్జ్‌మెమోలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బీట్‌ వ్యవస్థను పటిష్టం చేయాలని, ఈవ్‌టీజింగ్‌, గొలుసు దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు వాహన తనిఖీలను ముమ్మరం చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. విధుల్లో అలసత్వం వహించినా, అవినీతికి పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు. ఎస్పీ వెంట నగర ఇనచార్జి డీఎస్పీ అబ్దుల్‌ సుబహాన, నగర ఇనస్పెక్టర్లు మధుబాబు, దశరధరామయ్య ఉన్నారు.

Updated Date - 2022-10-04T05:39:04+05:30 IST