చెక్‌ పోస్టును సందర్శించిన ఎస్పీ

ABN , First Publish Date - 2021-08-02T06:03:33+05:30 IST

ఆంధ్ర–తెలంగాణ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ను జిల్లా ఎస్పీ రాహు ల్‌ దేవ్‌ శర్మ ఆకస్మికంగా సందర్శించారు.

చెక్‌ పోస్టును సందర్శించిన ఎస్పీ
సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ

జీలుగుమిల్లి, ఆగస్ట్టు 1: ఆంధ్ర–తెలంగాణ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ను జిల్లా ఎస్పీ రాహు ల్‌ దేవ్‌ శర్మ ఆకస్మికంగా సందర్శించారు. చెక్‌పోస్టు పరిసర ప్రాంతాలు పరిశీలించారు.  అక్రమ మార్గాలలో మద్యం తరలిపోకుండా రాత్రి సయమంలో వచ్చే వాహనాల తనిఖీలపై ఆరా తీశారు. చెక్‌పోస్టు సిబ్బందికి నిర్మించే భవనం పరిశీలించారు. అనంతరం నెర్సుగూడెం చెక్‌పోస్టు వద్ద ఎస్పీవోలతో మా ట్లాడి ఇంతవరకు ఎంత మద్యం పట్టుకున్నారు.. రాకపోకలు సాగించే వాహనాల వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. పోలీస్‌, ఎస్‌ఈబీ, ఎస్పీవో సిబ్బంది విధుల నిర్వహణ తీరుపై ఆరా తీశారు. అనంతరం జీలుగుమిల్లి పోలీస్‌ స్టేషన్‌లో రికార్డులను, స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలించారు. ఎస్పీ వెంట సీఐ ఎ. నవీన్‌ నరసింహమూర్తి, ఎస్‌ఐ కె.విశ్వనాథబాబు, కానిస్టేబుల్‌ ఎ.రవి ఉన్నారు.


Updated Date - 2021-08-02T06:03:33+05:30 IST