మాధవరంలో హర్ ఘర్ తిరంగా
ABN , First Publish Date - 2022-08-11T05:47:59+05:30 IST
స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలు అప్పగించిన అమరవీరుల స్థూపం వద్ద స్వాతం త్య్ర వజ్రోత్సవాలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఎస్పీ యు.రవిప్రకాష్ పేర్కొన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్, ఆగస్టు 10 : స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలు అప్పగించిన అమరవీరుల స్థూపం వద్ద స్వాతం త్య్ర వజ్రోత్సవాలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఎస్పీ యు.రవిప్రకాష్ పేర్కొన్నారు. మిలటరీ మాధవరంలో హర్ ఘర్ తిరంగాలో భాగంగా బుధవారం ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. పెద తాడేపల్లి బీఆర్ అంబేద్కర్ న్యూ గురుకుల పాఠశాల విద్యార్థులు నిర్వహిం చిన మిలటరి బ్యాండ్ విన్యాసాలతో పోలీసులు, మాజీ సైనికోద్యో గులు గ్రామస్థులు మువ్వన్నెల జెండా చేతబూని ర్యాలిలో పాల్గొ న్నారు. సీఐ సత్యనారాయణమూర్తి, నాగరాజు, ఎస్ఐ ఎన్.శ్రీని వాస్, సర్పంచ్ ముప్పిడి సూర్యకుమారి పాల్గొన్నారు.