గుడివాడ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ తనిఖీలు

ABN , First Publish Date - 2022-03-08T00:06:08+05:30 IST

ఇద్దరు సీఐలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని

గుడివాడ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ తనిఖీలు

కృష్ణా: ఇద్దరు సీఐలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది యొక్క సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు స్పందన, ప్రత్యక్ష స్పందన ద్వారా వచ్చే ఫిర్యాదులపై సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని సిబ్బందికి ఆయన సూచించారు. వివిధ కేసులలో సీజ్ చేయబడిన వాహనాల రక్షణలో నిర్లక్ష్యం వహించ వద్దన్నారు. అవినీతి కార్యకలాపాలలో పాల్గొన్నారని తెలిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. 


 గుడివాడలో ఇద్దరు సీఐల బేరసారాల వ్యవహారం సంచలనం కల్గించిన సంగతి తెలిసిందే. గుడివాడ వన్‌టౌన్, టూటౌన్ సీఐలపై అభియోగాలు వచ్చాయి. లోక్ అదాలత్‌లలో రాజీకి వచ్చిన పాత కేసుల్లో కక్షిదారులను సీఐలు  బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుడివాడలోని పలు సంస్థల నుంచి లంచాలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు  వచ్చాయి. దీంతో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ విచారణ చేపట్టారు. ఈ అంశంపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని ఎస్పీ తెలిపారు. 

Updated Date - 2022-03-08T00:06:08+05:30 IST