రైతును కొట్టిన ఎస్ఐకి ఎస్పీ చార్జ్ మెమో
ABN , First Publish Date - 2020-04-09T11:05:19+05:30 IST
దామరచర్లలో పొలం పనులు పూర్తి చేసుకొని తిరిగి వెళ్తున్న రైతు సుబ్బారావును వాడపల్లి ఎస్ఐ నర్సింహారావు కొట్టాడని
నల్లగొండ, ఏప్రిల్8: దామరచర్లలో పొలం పనులు పూర్తి చేసుకొని తిరిగి వెళ్తున్న రైతు సుబ్బారావును వాడపల్లి ఎస్ఐ నర్సింహారావు కొట్టాడని సామాజిక, ప్రసార మాధ్యమాల ద్వారా వచ్చిన వార్త నేపథ్యంలో విచారణ జరిపి ఎస్ఐకి చార్జ్మెమో జారీ చేసినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. బుధవారం సాయంత్రం వాడపల్లి ఎస్ఐ, రైతు సుబ్బారావులను ఎస్పీ క్యాంపు కా ర్యాలయానికి పిలిచి విచారించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలుసుకోవడంతోపాటు విచారణ చేసిన అనంతరం రైతును కొట్టిన విషయంలో ఎస్ఐ తప్పు ఉన్నట్లు గుర్తించి చార్జ్మెమో జారీ చేసినట్లు ఎస్పీ వివరించారు.