సదరన్ రాక్స్ సంస్థకు సుప్రీంకోర్టులో ఊరట
ABN , First Publish Date - 2022-02-05T03:37:48+05:30 IST
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకి చెందిన సదరన్ రాక్స్
ఢిల్లీ: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకి చెందిన సదరన్ రాక్స్ అండ్ మినిరల్స్ సంస్థకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సీనరేజీ డిపాజిట్ చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. సదరన్ రాక్స్ అండ్ మినిరల్స్ సంస్థకు పదే పదే నోటీసులు జారీ చేయడంపై వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి, సీఎస్, రాష్ట్ర ముఖ్య కార్యదర్శులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.