ఆంధ్ర, తెలంగాణ ఓటమి

ABN , First Publish Date - 2021-02-27T09:04:37+05:30 IST

సౌత్‌ ఇండియా న్యాయవాదుల టీ20 క్రికెట్‌ టోర్నీని ఆంధ్ర, తెలంగాణ జట్లు ఓటమితో ఆరంభించాయి.

ఆంధ్ర, తెలంగాణ ఓటమి

సౌత్‌ ఇండియా న్యాయవాదుల టీ20 క్రికెట్‌ టోర్నీ


 ఇబ్రహీంపట్నం (ఆంధ్రజ్యోతి): సౌత్‌ ఇండియా న్యాయవాదుల టీ20 క్రికెట్‌ టోర్నీని ఆంధ్ర, తెలంగాణ జట్లు ఓటమితో ఆరంభించాయి.ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాదుల క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలోని మూలపాడు ఏసీఏ స్టేడియంలో ఈ టోర్నీని ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి శుక్రవారం ప్రారంభించారు. ఆంధ్ర, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక జట్లు కూడా ఇందులో ఆడుతున్నాయి. తమిళనాడుతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఆంధ్ర జట్టు 35 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఛేదనలో ఏపీ 84 పరుగులకే ఆలౌటైంది. మరో మ్యాచ్‌లో తెలంగాణతో తలపడిన కర్ణాటక ఒక వికెట్‌ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన తెలంగాణ నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులు చేయగా.. ఛేదనలో కర్ణాటక 9 వికెట్ల నష్టానికి 162 రన్స్‌ చేసి గెలుపొందింది.

Updated Date - 2021-02-27T09:04:37+05:30 IST