మరో రెండు అదనపు ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2021-03-02T11:59:09+05:30 IST

జోన్‌ నుంచి మరో రెండు అదనపు ప్రత్యేక రైళ్లను నడపనున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సోమ, శుక్రవారాల్లో కొల్హాపూర్‌-నాగ్‌పూర్‌ రైలు ఈ నెల 12 నుంచి....

మరో రెండు అదనపు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్: జోన్‌ నుంచి మరో రెండు అదనపు ప్రత్యేక రైళ్లను నడపనున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సోమ, శుక్రవారాల్లో కొల్హాపూర్‌-నాగ్‌పూర్‌ రైలు ఈ నెల 12 నుంచి ప్రారంభమవుతుందని, కొల్హాపూర్‌ నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12గంటలకు నాగ్‌పూర్‌కు చేరుకుంటుందని తెలిపారు. గురు, శనివారాల్లో నడిచే నాగ్‌పూర్‌-కొల్హాపూర్‌ రైలు 13న ప్రారంభమవుతుందని, నాగ్‌పూర్‌ నుంచి మధ్యాహ్నం 3.15గంటలకు బయలుదేరి, కొల్హాపూర్‌కు మరుసటి రోజు మధ్యాహ్నం 2గంటలకు చేరుకుంటుందని తెలిపారు.

Updated Date - 2021-03-02T11:59:09+05:30 IST